Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

ఛలో బడంగ్‌పేట్

మాన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా మార్చి 15న హైదరాబాద్ బడంగ్‌పేట్‌లో బహుజన మహాసభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. జిల్లాల నుంచి భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తాడూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం తాడూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించి, రోగులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని…

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ కేంద్రంలో ప్రసవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కోడేరు కేజీబీవీ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

విజయ్ దేవరకొండ–రష్మికను కలిసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.

మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.