ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు ఆదేశించారు.
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు ఆదేశించారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించి, వచ్చేనెల 20లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ కార్యక్రమం కింద మార్చి 29న FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. జిల్లాలో 25,313 మంది మహిళలు మరియు వయోజనులు ఈ పరీక్షకు…
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రామాన్ని ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేయాలని…
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మహిళా సిబ్బందిని ప్రోత్సహించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.