నంది వడ్డేమాన్లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శ్రీశైలం దర్శనానికి వెళ్తూ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ వద్ద ఆగగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్…
నాగర్ కర్నూల్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి డాక్టర్ వాణి సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మహిళా సిబ్బందిని ప్రోత్సహించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అక్రమ అబార్షన్ల ఆరోపణల నేపథ్యంలో కొల్లాపూర్లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేశారు.
నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.
గ్లూకోమా (నీటి కాసుల వ్యాధి) వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి కంటి ఆరోగ్యంపై ప్రజలకు సూచనలు ఇచ్చిన అధికారులు.