పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన–వినోద పర్యటన
నాగర్ కర్నూల్లోని పల్లవి మోడల్ స్కూల్ నాలుగో, ఐదో, ఆరవ తరగతుల విద్యార్థులు మహబూబ్నగర్లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రం, సైన్స్ మ్యూజియం మరియు మయూరి పార్క్ను సందర్శిస్తూ విజ్ఞాన–వినోద పర్యటనలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్లో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
కొండారెడ్డిపల్లిలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ ప్రారంభం
బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రామాన్ని ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేయాలని…
జిల్లాలో మూడు కేజీబీవీలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక
నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి, వెల్దండ, నాగర్ కర్నూల్ కేజీబీవీలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతుల కష్టాలు నేతలకు పట్టవా?
నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
నంది వడ్డేమాన్లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
శ్రీశైలం ప్రయాణంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నాగర్ కర్నూల్ జిల్లాలో ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శ్రీశైలం దర్శనానికి వెళ్తూ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ వద్ద ఆగగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్…
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: వైద్యాధికారిణి డాక్టర్ వాణి
నాగర్ కర్నూల్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి డాక్టర్ వాణి సూచించారు.
