బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సర్టిఫికెట్కు రూ.500 చొప్పున డీల్ కుదుర్చుకుని, మొత్తం ఐదు సర్టిఫికెట్లకు రూ.25 వేల రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ను ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనీలో ఉన్న ఆయన నివాసం మరియు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత పత్రాలు మరియు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.: నారాయణపేట ఆర్డీఓ ఏసీబీ వలలో
