ఈ సందర్భంగా జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లప్పుడూ సహకరిస్తారని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించేందుకు ఉద్యోగులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని వారు హామీ ఇచ్చారు.
అదనపు కలెక్టర్ చెన్నయ్య కూడా ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్, ఉపాధ్యక్షుడు చెన్నకేశవులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాగర్కర్నూల్ యూనిట్ అధ్యక్షుడు నసిరుద్దీన్, కార్యదర్శి సురేష్ కుమార్, మహిళా నాయకులు అలివేలు, అరుణ, అలాగే రామకృష్ణ, సుదర్శన్, బుగ్గప్ప, నాగయ్య, రాకేష్ కన్నా తదితరులు పాల్గొని నూతన అదనపు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు.: నాగర్కర్నూల్ నూతన అదనపు కలెక్టర్ చెన్నయ్యకు జిల్లా టీఎన్జీవో నాయకుల ఘన సన్మానం


