నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట: ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వడ్డే హనుమంత రెడ్డి డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలం నడింపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అర్జునయ్య పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం సరైంది కాదని పేర్కొన్నారు. వెంటనే వాటిని చెల్లించి ఉపాధ్యాయులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే రెండవ పీఆర్‌సీని ప్రకటించి అమలు చేయాలని, పర్యవేక్షక పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్ మురళి, కార్యదర్శి కొత్త శ్రీధర్ రావు, మండల నాయకులు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *