పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి మాట్లాడుతూ పదవీ విరమణ ఉద్యోగ జీవితంలో చివరి దశ మాత్రమేనని, అది మనసుకు విరమణ కాదని పేర్కొన్నారు. గాడి సుగుణ కుమారి తన 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో మంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన తృప్తి జీవితంలో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. విద్యార్థులు సమాజ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాఘవేందర్, ఖలీల్, రాజేష్, గోపాలకృష్ణ, వెంకటస్వామి, కుర్మయ్య, సరళ, కవిత తదితరులు ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, శిష్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: సమాజ మార్పుకు ఉపాధ్యాయులే కీలకం




