Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

విజయ్ దేవరకొండ–రష్మికను కలిసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

జియో కార్యాలయ మేనేజర్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు

మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ జియో కార్యాలయ మేనేజర్‌పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు కాగా, యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

యుద్ధ ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెంపు?

విదేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఇప్పటికే ఉన్న స్టాక్‌పైనా ధరలు పెంచడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్

సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిజం పాఠశాలలో 55 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ తెలిపారు. శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో మూఢనమ్మకాలను తొలగించవచ్చని అన్నారు.

మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరన

నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

సమ్మె బాటలో విద్యుత్ స్పాట్ బిల్లర్స్

కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో స్పాట్ బిల్లర్స్ మార్చి 1 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. 20 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కుమ్మెర బాధితులను కలిసిన కవిత

కుమ్మెర ఘటన బాధితులను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముందు కలిసిన కవిత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.