గ్రామ ప్రతిష్టను కాపాడుతూ గౌరవాన్ని పెంపొందించాలి
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, రెండు నెలల పాప మృతి ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా,…
నాగర్కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షలు సజావుగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.
నాగర్కర్నూల్లో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మీసేవ కేంద్రంలో యువకులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్…
నాగర్ కర్నూల్ మండలం, కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి తాజా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కుమ్మెర జాతర ఘటనలో పసిపాప మృతి నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రేపు నాగర్కర్నూల్కు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు కుమ్మెర గ్రామంలో బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘం హర్షం వ్యక్తం చేసింది. కోటి బీమా, 010 పద్దు జీతాలు వంటి ఉద్యోగ అనుకూల విధానాలకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.