కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని దన్నోజు అరవింద్ చారి కోరారు. మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. బీసీల జనాభా లెక్కలు వెల్లడైతే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం కులగణన విషయంలో వెనుకడుగు వేస్తోందని ఆయన ఆరోపించారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా దక్కాలంటే కులగణన తప్పనిసరి అని ఆయన అన్నారు. కులగణన చేపట్టకపోతే దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గం హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు శివ, హనుమంతు, సత్య, నారాయణ, శేఖర్, రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.: కులగణన చేపట్టకుంటే బీజేపీని బీసీ సామాజిక వర్గం క్షమించదు


