Author: voiceofnagarkurnool@gmail.com

కుమ్మెర ఘటనలపై నిందితుల అరెస్ట్

కుమ్మెర జాతర ఘటనలపై నాగర్ కర్నూల్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి పలు కేసుల వివరాలు వెల్లడించారు. శిశువు మృతి కేసుతో పాటు దాడులపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు.

న్యూ గీతం ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నాగర్ కర్నూల్‌లోని మన భూగీతం ప్రైమరీ స్కూల్‌లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వివిధ పరిపాలనా పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఘనంగా శనేశ్వర స్వామికి పూజలు

నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శనేశ్వర స్వామికి భక్తులు ఘనంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శని గ్రహ దోష నివారణకు ప్రత్యేక అర్చనలు, రుద్రాభిషేకాలు జరిపారు.

డాక్టర్ భీమ్ భరత్‌కు తెలంగాణ గవర్నర్ అభినందనలు

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన MBBS విద్యార్థి డాక్టర్ భీమ్ భరత్‌ను తెలంగాణ గవర్నర్ అభినందించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు పొందారు.

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకారం

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్‌గా షాన్ వాజ్ ఖాన్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

పులిజాల–కార్వంగ శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి హామీ

పులిజాల–కార్వంగ గ్రామాల మధ్య వాగు సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు.

శివాజీ మహారాజ్ నవతరానికి స్ఫూర్తి

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి అని నేతలు తెలిపారు.

శివాజీ జయంతి సందర్భంగా 43 యూనిట్ల రక్తదానం

శివాజీ జయంతి సందర్భంగా తిమ్మాజిపేటలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 43 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

నాగర్‌కర్నూల్‌లో బిఎస్పీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నేతలు తెలిపారు.

మానవత్వం మంట కలిసిన ఘటన

నాగర్‌కర్నూల్ చెరువులో నాగనోలు గ్రామానికి చెందిన మహిళ మృతి చెందగా, మృతదేహాన్ని చెత్త వాహనంలో తరలించిన ఘటన ప్రజలను కలచివేసింది. అంబులెన్స్ లేమిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.