మరణించిన వ్యక్తి నుంచి ఆరు గంటలలోపు నల్లగుడ్డులోని కార్నియాను దానం చేస్తే, దానిని అవసరమైన వారికి అమర్చి ఇద్దరికి కంటిచూపు కల్పించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కంటి శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి 51 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వారిలో 21 మందికి కేటరాక్ట్ (కంటి శుక్లం) సమస్య ఉన్నట్లు గుర్తించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా రామ్రెడ్డి కంటి ఆసుపత్రికి కంటి ఆపరేషన్ల కోసం తరలించారు.
మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని, తద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని అధికారులు కోరారు. మరణించిన వ్యక్తి నుంచి ఆరు గంటల్లోపు నేత్రదానం చేయదలచిన కుటుంబ సభ్యులు 9440876556 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
నేత్రదానం ద్వారా మరణించిన వ్యక్తి కళ్లతో మరో ఇద్దరికి చూపు లభించే అవకాశం ఉన్నందున ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పారామెడికల్ అధికారి సుకుమార్ రెడ్డి, సిబ్బంది అన్వర్ తదితరులు పాల్గొన్నారు: కంటి దానం మరో ఇద్దరికి చూపు ప్రసాదం..


