నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్‌లో సంచలనం రేపిన హత్య కేసు వెనుక అసలు నిజాలు బయటపడ్డాయి. ఆస్తి వివాదం, పాత కక్షలే ఈ దారుణానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 4న వెల్దండ మండలం పోతేపల్లి రోడ్డుపై జరిగిన ఈ ఘటన మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు, దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు.
రుద్రాక్షల మహేష్ (27) మారుతి జెన్ కారులో ప్రయాణిస్తుండగా, నిందితులు ముందుగా టిప్పర్‌తో అతని కారును ఢీకొట్టారు. ప్రమాదం జరిగినట్లు చూపించి, మహేష్ ఇంకా ప్రాణాలతో ఉండగానే రాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు టిప్పర్ డ్రైవర్‌కు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చినట్లు కూడా వెల్లడించారు.
ఈ కేసులో ఏ1 అన్వేష్, ఏ2 శివ, ఏ3 పవన్, ఏ4 వెంకటమ్మ, ఏ5 కృష్ణయ్య, ఏ6 బురాన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తిమ్మరాశిపల్లి గ్రామ శివారులో పందుల షెడ్ వద్ద నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులపై గతంలోనే కేసులు ఉండగా, ఏ1 నుంచి ఏ3 వరకు రౌడీ షీట్ కూడా నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన వెల్దండ పోలీసులకు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందనలు తెలిపారు. సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి మరియు వారి బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ ఘటన ఆస్తి వివాదాలు ఎంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో మరోసారి స్పష్టం చేసింది.: పక్కా ప్లాన్‌తో యువకుడి హత్య – ఆరుగురు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *