Category: latest News

డిజిటల్ విధానంలో జనాభా గణనకు సిద్ధం కావాలి

భారతదేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనాభా గణన జరగనుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో తప్పులు లేకుండా గణన నిర్వహించాలని సూచించారు.

ఉపాధి హామీ పనుల్లో కూలీలకు వేతనాలు చెల్లించాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సిపిఎం నాయకుడు గుంపల్లి అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆశా వర్కర్ల డిమాండ్లకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన వంట వార్పు నిరసనకు BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఫిక్స్డ్ వేతనం, PF, ESI వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.

తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ…

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితుల కోసం పోరాటం

ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డా. విశారదన్ మహరాజ్ అరెస్టును ఖండిస్తూ నాగర్‌కర్నూల్‌లో BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి

నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసి) ముందు అన్ని రకాల బస్సులు ఆగేలా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని టీఎన్జీవో యూనియన్ నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

జిల్లాలో వంద శాతం అక్షరాస్యత లక్ష్యం

నాగర్ కర్నూల్ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ కార్యక్రమం కింద మార్చి 29న FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. జిల్లాలో 25,313 మంది మహిళలు మరియు వయోజనులు ఈ పరీక్షకు…

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.

మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి

పట్టణంలోని అన్ని కమర్షియల్ సంస్థలు, దుకాణాలు మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి సూచించారు. గడువు తర్వాత తీసుకోకపోతే పెనాల్టీ విధించడంతో పాటు అవసరమైతే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.