Tag: హేమంత్ కేశవ్ పాటిల్

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానం..

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని సాధించిన నాగర్‌కర్నూల్ జిల్లాకు మరో గౌరవం దక్కింది. ఉత్తమ జిల్లా టిబి అధికారిగా డాక్టర్ ఎం.డి. రఫీకి తెలంగాణ గవర్నర్ అవార్డు లభించగా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సన్మానించారు.

యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్‌కు రాష్ట్ర స్థాయి ప్రశంసలు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని సీఎస్ సంజయ్ జాజు ప్రశంసించారు. ఆగస్టు 25లోగా రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.