Tag: తెలంగాణ వార్తలు

నాగర్ కర్నూల్‌లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టు..

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీసులు భారీ బైక్ చోరీ ముఠాను ఛేదించి 52 దొంగిలించిన మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు డ్రగ్స్ కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

నేటి ప్రజావాణికి 42 ఫిర్యాదులు.. సత్వర పరిష్కారానికి ఆదేశాలు:

నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 42 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకల ఆరోపణలు..

నాగర్‌కర్నూలు జిల్లా తుమ్మలసుగూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు, ఫీల్డ్ వెరిఫికేషన్‌లో లోపాలపై విచారణ చేపట్టాలని కోరారు

బిజినపల్లి గ్రామసభలో ఇందిరమ్మ చీరల దుర్వినియోగం..?

నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి మండల గ్రామసభలో ఇందిరమ్మ మహిళా చీరలను బల్లపై పరిచిన ఘటన వివాదాస్పదమైంది. ప్రభుత్వ పథకం వస్తువుల వినియోగంలో నిర్లక్ష్యం జరిగిందంటూ గ్రామస్థులు విచారణకు డిమాండ్ చేస్తున్నారు.