పాప మృతి పై దర్యాప్తు కొనసాగుతోంది, ఎస్పీ స్పష్టం

కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, రెండు నెలల పాప మృతి ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా,…

ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షలు సజావుగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సౌజన్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభమైంది.

మార్చి 1 నుంచి మీటర్ రీడింగ్ నిలిపివేతకు స్పాట్ బిల్లర్స్ హెచ్చరిక

నాగర్‌కర్నూల్‌లో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మీసేవ కేంద్రంలో యువకులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్…

కుమ్మెర ఘటనపై బీఆర్ఎస్ స్పందన

కుమ్మెర జాతర ఘటనలో పసిపాప మృతి నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రేపు నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు కుమ్మెర గ్రామంలో బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.

ఉద్యోగులు–పెన్షనర్లకు ఆరోగ్య పథకం

ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘం హర్షం వ్యక్తం చేసింది. కోటి బీమా, 010 పద్దు జీతాలు వంటి ఉద్యోగ అనుకూల విధానాలకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

బాధితులపైనే కేసులు రాజ్యాంగ విరుద్ధం

కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

అంటరానితనాన్ని క్షమించబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక

రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.