గ్రామస్తులు తమకు ఎదురవుతున్న సమస్యలను మంత్రికి వివరించగా, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచడమే కాకుండా, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
అలాగే సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు కావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించడంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు.: మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన



