Category: Achampet

విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.

🚭 నో స్మోకింగ్ డే: పొగరహిత సమాజం కోసం అవగాహన అవసరం

పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

అచ్చంపేట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు.

2027 జనగణనలో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు కాలం కేటాయించాలి

2027 జనగణనలో గిరిజనులను ప్రత్యేకంగా గుర్తించేందుకు ప్రత్యేక కాలం కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి (HPV) వాక్సినేషన్ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఈ టీకా ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలిపారు.

విజయ్ దేవరకొండ–రష్మికను కలిసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.

మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

రేపు తుమ్మనిపేట లో విజయ్ దేవరకొండ రష్మిక మందన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తుమ్మలపేట గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11 గంటలకు ముగియనుంది.

గ్రామ ప్రతిష్టను కాపాడుతూ గౌరవాన్ని పెంపొందించాలి

అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.