తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా లోక్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా లోక్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. దాదాపు 10 కంపెనీలు పాల్గొననున్న ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎండబెట్ల గ్రామంలో జరగనున్న గో వృషభ కళ్యాణం, గోదాన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మార్చి 12న కొత్తగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అచ్చంపేట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో 2.5 లక్షల పశువులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిబ్బంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ వి. శేఖర్ మరియు డాక్టర్ రవికుమార్ నాయక్ ప్రారంభించారు.
నాగర్కర్నూల్లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.