Tag: TSRTC Bus Stand

నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌కు శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పట్టణ అభివృద్ధికి ఊతమివ్వనుంది.