కోడేరు కేజీబీవీ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
విజయ్ దేవరకొండ–రష్మికను కలిసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.
మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో
ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
జియో కార్యాలయ మేనేజర్పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు
మహబూబ్నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ జియో కార్యాలయ మేనేజర్పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు కాగా, యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.
కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు
కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
యుద్ధ ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెంపు?
విదేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఇప్పటికే ఉన్న స్టాక్పైనా ధరలు పెంచడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రేపు తుమ్మనిపేట లో విజయ్ దేవరకొండ రష్మిక మందన
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తుమ్మలపేట గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11 గంటలకు ముగియనుంది.
పాలెం చిన్నారి మృతి ఘటనపై వేగవంతమైన విచారణ చేపట్టాలి
పాలెం గ్రామంలో మూడు నెలల చిన్నారిని నీటి తొట్టిలో వేసి హత్య చేసిన ఘటనపై వేగంగా విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.
