TNGO 2026 డైరీ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్‌లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు 34 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. లీకేజీలు, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.

భూసేకరణ వేగవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేసి నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు మార్చి 16న పోలింగ్ జరగనుంది.

మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థల పరిశీలన

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని

శివరాత్రి రోజు గంజాయి సమర్పణ

శివరాత్రి రోజున శంషాబాద్ ధర్మగిరి శివాలయంలో కొందరు యువకులు గంజాయి సమర్పిస్తూ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మద్దిమడుగులో సీఎం ఓఎస్‌డీ పర్యటన

మద్దిమడుగులో సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా స్వాగతం పలికారు.