కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు
కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
యుద్ధ ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెంపు?
విదేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఇప్పటికే ఉన్న స్టాక్పైనా ధరలు పెంచడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రేపు తుమ్మనిపేట లో విజయ్ దేవరకొండ రష్మిక మందన
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తుమ్మలపేట గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11 గంటలకు ముగియనుంది.
పాలెం చిన్నారి మృతి ఘటనపై వేగవంతమైన విచారణ చేపట్టాలి
పాలెం గ్రామంలో మూడు నెలల చిన్నారిని నీటి తొట్టిలో వేసి హత్య చేసిన ఘటనపై వేగంగా విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.
కుమ్మెర ఘటనను రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించవద్దు
కుమ్మెర గ్రామంలో చిన్నారి మరణ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబిసి ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
జిల్లా ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్నప్రసాదం
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం రోగి సహాయకులకు సత్యసాయి అన్నప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. రోజుకు 120–150 మందికి భోజనం అందిస్తున్నారు.
ధార్మిక చైతన్యానికి యువత ముందుకు రావాలి
సనాతన ధర్మ పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక చైతన్య సమావేశంలో పాల్గొని సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
మోడల్ స్పోర్ట్స్ / వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలు మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరారు. జిల్లా స్థాయి ఎంపికలు మార్చి 11న కల్వకుర్తిలో…
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమాజీపేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్
సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిజం పాఠశాలలో 55 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ తెలిపారు. శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో మూఢనమ్మకాలను తొలగించవచ్చని అన్నారు.
