మున్సిపల్ చైర్మన్గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.
మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న 18 మంది అభ్యర్థులు
నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
రేపే నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
నాగర్కర్నూల్లో రేపు నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరగనుంది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ 18, విపక్ష భారత రాష్ట్ర సమితి 6 సీట్లు సాధించగా, చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
ఉమామహేశ్వరం ఆలయంలో భక్తుల పోటెత్తు – దర్శనానికి గంట సమయం
మహాశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరం స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దర్శనానికి కనీసం గంట సమయం పడుతుండగా, కొండపైకి టెంపుల్ బస్సుల ద్వారానే అనుమతిస్తున్నారు.
అమరవీర జవానులకు ఘన నివాళి…
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీర జవాన్ల స్మరణార్థం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామంలో యువకులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
నాగర్ కర్నూల్లో పుల్వామా అమర జవాన్లకు ఘన నివాళి
పుల్వామా దాడి జరిగిన రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ:పూర్తి ఫలితాలు
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.
తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు
తెలంగాణలో పలు జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్… నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, మధిర ప్రాంతాల్లో ఘన విజయం.
మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు
మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా, బ్యాలెట్ బాక్సుల నుండి తీసిన పోలైన బ్యాలెట్ పత్రాలను
