Category: Education

విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పాఠశాలలు–కాలేజీలు–విశ్వవిద్యాలయాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు మరియు విద్యార్థులకు అవసరమైన ముఖ్య అప్డేట్స్.

పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

మోడల్ స్పోర్ట్స్ / వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలు మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరారు. జిల్లా స్థాయి ఎంపికలు మార్చి 11న కల్వకుర్తిలో…

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరికరాల ప్రదర్శన

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ పరికరాల ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరన

నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

నాల్గవ రోజు 5,763 మంది హాజరు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ నాల్గవ రోజు పరీక్షలకు 5,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు తెలిపారు.

ప్రశాంతంగా మూడవ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మూడవ రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,163 మంది విద్యార్థుల్లో 6,908 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 60 కేంద్రాల్లో 25 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, భద్రత, మౌలిక వసతులు, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు.

పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం నిధులు కేటాయించడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయమని ఏఐఎస్ఎఫ్ నేత బలుమల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలకపల్లి మండల నూతన ఏఐఎస్ఎఫ్ సమితిని ఎన్నుకున్నారు.