నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లట్టుపల్లి గ్రామానికి చెందిన పంతుల బాజీరావు మూడవ వర్ధంతి పురస్కరించుకొని కుటుంబ సభ్యులు పి. మల్లాజీ–రజిని దంపతులు సత్యసాయి అన్నప్రసాద పంపిణీ కేంద్రం ద్వారా రోగి సహాయకులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వీకుల జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గర్భవతులు, రోగుల సహాయకులు, చిన్నారులు సహా 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగుల కుటుంబ సభ్యులకు ఈ అన్నదానం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది.
అన్నప్రసాద కేంద్రం బాధ్యులు ఎలిమేశ్వరయ్య మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని అన్నదానం చేయదలచిన వారు నేరుగా కేంద్రాన్ని సంప్రదించవచ్చని లేదా 9441303182 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంతుల భారతమ్మ, మనస్విని, సాత్విక, సత్యసాయి అన్నప్రసాద కార్యదర్శి ఎలిమేశ్వరయ్య, సాయి ప్రకాష్, బాలయ్య, పాండు, కృష్ణయ్య, బాలకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *