నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. హాస్టల్‌లో చదువుతున్న సుమారు 25 మంది పదో తరగతి విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.
ఈ సందర్భంగా వార్డెన్ రాధా మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అలాగే స్కూల్‌కు మరియు హాస్టల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలా చదవాలి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి వంటి అంశాలపై కూడా వారికి మార్గనిర్దేశం చేశారు.
విద్యార్థినులు మాట్లాడుతూ హాస్టల్‌లో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని, ప్రశాంత వాతావరణంలో చదువుకోవడానికి మంచి అవకాశం లభిస్తోందని తెలిపారు. ఇక్కడ ఉండటం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
వార్డెన్ మరియు సిబ్బంది అందిస్తున్న సహకారంతో పరీక్షలకు బాగా సిద్ధమయ్యామని, మంచి ఫలితాలు సాధించి స్కూల్‌కు మరియు హాస్టల్‌కు మంచి పేరు తీసుకువస్తామని విద్యార్థినులు తెలిపారు.: పదో తరగతి విద్యార్థులకు వార్డెన్ రాధా ఆల్ ది బెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *