కుమ్మెర ఘటనను రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించవద్దు

కుమ్మెర గ్రామంలో చిన్నారి మరణ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబిసి ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

జిల్లా ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్నప్రసాదం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం రోగి సహాయకులకు సత్యసాయి అన్నప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. రోజుకు 120–150 మందికి భోజనం అందిస్తున్నారు.

ధార్మిక చైతన్యానికి యువత ముందుకు రావాలి

సనాతన ధర్మ పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక చైతన్య సమావేశంలో పాల్గొని సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.

మోడల్ స్పోర్ట్స్ / వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలు మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరారు. జిల్లా స్థాయి ఎంపికలు మార్చి 11న కల్వకుర్తిలో…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమాజీపేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్

సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిజం పాఠశాలలో 55 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ తెలిపారు. శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో మూఢనమ్మకాలను తొలగించవచ్చని అన్నారు.

శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు

బీజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని శనేశ్వర స్వామి ఆలయంలో శని దోష నివారణార్థం భక్తులు తిలతైల అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరికరాల ప్రదర్శన

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ పరికరాల ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరన

నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

నాల్గవ రోజు 5,763 మంది హాజరు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ నాల్గవ రోజు పరీక్షలకు 5,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు తెలిపారు.