పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ గ్రామానికి చెందిన అన్నలదాసి జగన్ మోహన్ (32) కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఉన్న వ్యక్తిగత విభేదాలు, పాత వైరం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మార్చి 1, 2026 రాత్రి సుమారు 7 గంటల సమయంలో మిద్దె పరుశురాములు (45), కడిరె నాగరాజు (40), కడిరె పార్వతమ్మ (36) కలిసి జగన్ మోహన్పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్రలు మరియు రాళ్లతో తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జగన్ మోహన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై మృతుడి అన్న అన్నలదాసి శివశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నాగర్కర్నూల్ సబ్-డివిజనల్ పోలీస్ అధికారి బుర్రి శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కేసు పై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు: జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్
