హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన టీజీ ఆర్టీసీ సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని నియోజకవర్గ రవాణా సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్‌లో కొత్తగా మంజూరైన బస్ స్టేషన్ నిర్మాణానికి తక్షణమే శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా తెల్కపల్లి, తిమ్మాజీపేట బస్ స్టాండ్ల దుస్థితిని వివరించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రజల విన్నపం మేరకు నాగర్ కర్నూల్ నుండి నల్గొండకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని, అలాగే నియోజకవర్గంలోని కీలక మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు.

ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (IAS), టీజీ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (IPS) తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన సూచనలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.: నాగర్ కర్నూల్ కొత్త బస్ స్టేషన్‌కు శంకుస్థాపన తేదీ ఖరారు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *