ఈ రక్తదాన శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఆకుతోట సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, ఒక వ్యక్తి రక్తదానం ద్వారా మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో రక్త నిల్వలు తగ్గిపోతాయని, యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. యువతలో సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రాధాకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్, ట్రెజరర్ కృష్ణారావు మరియు ఇతర సభ్యులు హాజరై రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.: నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
