నాగర్ ర్నూల్ జిల్లా అచ్చంపేటలో డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని అచ్చంపేట సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అచ్చంపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో వివిధ మండలాలకు చెందిన 107 మంది ఆటో, లారీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. రహదారి భద్రత దృష్ట్యా డ్రైవర్లకు కంటి పరీక్షలు అత్యవసరమని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాసులు పాల్గొని డ్రైవర్లకు రోడ్డు భద్రత, కంటి ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సీఐ నాగరాజు, ఎస్సై కె. సద్దాం హుస్సేన్ సహా ఇతర సబ్ డివిజన్ ఎస్సైలు హాజరై శిబిర నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు. శివాని ఆప్టికల్కు చెందిన ఆప్టిమెట్రిషియన్ లింగారెడ్డి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోగ్య శిబిరాలను మరింత విస్తరించనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.: అచ్చంపేటలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *