నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రావని, కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఎక్కువ ఫండ్లు అందుతున్నాయని తెలిపారు.

తాను ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాట పంథాలోనే ఉన్నానని, రోడ్లు, వీధిదీపాలు, మున్సిపాలిటీ సమస్యలు, ట్యాంక్‌బండ్ రోడ్డు వద్ద బ్రిడ్జ్, మెడికల్ కాలేజ్, ఆసుపత్రి సేవలు వంటి అనేక అంశాలపై ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేసినట్లు చెప్పారు.

ప్రతి సమస్యపై అధికారులను నిలదీస్తూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో 8వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.: 8వ వార్డు సమస్యలపై పోరాటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *