జిల్లాలో సుమారు 150 మంది స్పాట్ బిల్లర్స్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా నెలకు కేవలం రూ.2,000 వేతనంతో విధులు నిర్వర్తిస్తున్నామని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
హర్షద్, తరుణ్, ప్రవీణ్, సన్నీ, సురేందర్, ప్రసాద్, శివ తదితరులు కలిసి SAO మరియు DE కార్యాలయాలకు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమ్మె కారణంగా మీటర్ రీడింగ్ మరియు బిల్లింగ్ ప్రక్రియలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.: సమ్మె బాటలో విద్యుత్ స్పాట్ బిల్లర్స్
