నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన బాలిక గర్భధారణ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలిక స్కానింగ్ కేంద్రం మూత్రశాలలో ప్రసవించిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వనపర్తి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు.

పరీక్ష రాసిన అనంతరం కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన బాలికకు మగ శిశువు జన్మించిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో బాలికకు పరిచయం ఉన్న బాలుడే గర్భానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై జేసీడీవో శోభారాణి బాలిక చదివిన పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. విద్యార్థుల పర్యవేక్షణలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నదేమోనని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ అధికారులకు నివేదికగా పంపినట్లు సమాచారం.: బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *