చిన్నారి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకో కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. నిరసనకారులతో చర్చలు జరిపి, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.చిన్నారి మృతి ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపగా, ప్రజలు కూడా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారు.: కుమ్మెర జాతర ఘటనపై రాస్తారోకో
