సమ్మెలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి మీటర్ రీడింగ్ పనులను నిలిపివేయాలని స్పాట్ బిల్లర్స్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో సుమారు 150 మంది స్పాట్ బిల్లర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. వీరు చాలా కాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
స్పాట్ బిల్లర్స్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా కేవలం నెలకు రూ.2 వేల వేతనంతోనే పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని స్పాట్ బిల్లర్స్ యూనియన్ హెచ్చరించింది.: నాగర్కర్నూల్లో సమ్మె బాటలో విద్యుత్ స్పాట్ బిల్లర్స్
