వైద్యులు మరియు సిబ్బందితో సమావేశమై, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని, బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు తెల్లని దుస్తులు ధరించడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. నారాయణస్వామి, సిహెచ్ఏ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్ భాగ్యమ్మ, ఫార్మసిస్ట్ సంపత్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.: డీఎంహెచ్ఓ డా. రవికుమార్ ఆకస్మిక తనిఖీ
