నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం ప్రశ్నపత్రాలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. ఆదివారం పేపర్-1 ప్రశ్నపత్రాలు అందుకోగా, సోమవారం కలెక్టరేట్ నుండి ఆయా మండలాల పోలీస్ స్టేషన్లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు. మొత్తం నాలుగు రూట్ల ద్వారా ప్రశ్నపత్రాలను పంపిణీ చేసి, ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు.

జిల్లాలో 20 మండలాలు, నాలుగు మున్సిపాల్టీల పరిధిలో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మొత్తం 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ పర్యవేక్షణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, రూట్ అధికారులు సమన్వయంతో ప్రశ్నపత్రాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, ఎంఈఓ కురుమయ్య, ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య, కృష్ణారెడ్డి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.: పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *