Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు, గుత్తేదారులకు ఆదేశించారు.

అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరణ

నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈవో దేవ సహాయం నుంచి బాధ్యతలు తీసుకున్నారు.

రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల – అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ అవకాశం

తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు.

జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్

నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగర్ కర్నూల్‌లో మైనర్ గర్భధారణ కేసు సంచలనం

నాగర్ కర్నూల్ జిల్లాలో మైనర్ గర్భధారణ కేసు విచారణలో కీలక మలుపు తిరిగి, అసలు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఛలో బడంగ్‌పేట్

మాన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా మార్చి 15న హైదరాబాద్ బడంగ్‌పేట్‌లో బహుజన మహాసభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. జిల్లాల నుంచి భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తాడూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం తాడూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించి, రోగులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని…

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ కేంద్రంలో ప్రసవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కోడేరు కేజీబీవీ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.