Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకారం

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్‌గా షాన్ వాజ్ ఖాన్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

నాగర్‌కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులో కారు–బైక్ ఢీకొని బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) అక్కడికక్కడే మృతి చెందారు.

పులిజాల–కార్వంగ శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి హామీ

పులిజాల–కార్వంగ గ్రామాల మధ్య వాగు సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెల్కపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు.

SLBC టన్నల్ పనులు పునఃప్రారంభం

మన్నెవారిపల్లి SLBC టన్నల్ పనులు ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఆధునిక సర్వేలు, ATM బ్లాస్టింగ్‌తో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

శివాజీ మహారాజ్ నవతరానికి స్ఫూర్తి

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి అని నేతలు తెలిపారు.

శివాజీ జయంతి సందర్భంగా 43 యూనిట్ల రక్తదానం

శివాజీ జయంతి సందర్భంగా తిమ్మాజిపేటలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 43 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

నాగర్‌కర్నూల్‌లో బిఎస్పీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నేతలు తెలిపారు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే

కుమ్మెర గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే డా. రాజేశ్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మానవత్వం మంట కలిసిన ఘటన

నాగర్‌కర్నూల్ చెరువులో నాగనోలు గ్రామానికి చెందిన మహిళ మృతి చెందగా, మృతదేహాన్ని చెత్త వాహనంలో తరలించిన ఘటన ప్రజలను కలచివేసింది. అంబులెన్స్ లేమిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.