నాల్గవ రోజు 5,763 మంది హాజరు
నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ నాల్గవ రోజు పరీక్షలకు 5,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ నాల్గవ రోజు పరీక్షలకు 5,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు తెలిపారు.
కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో స్పాట్ బిల్లర్స్ మార్చి 1 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. 20 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కుమ్మెర ఘటన బాధితులను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం ముందు కలిసిన కవిత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మూడవ రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,163 మంది విద్యార్థుల్లో 6,908 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
అచ్చంపేటలో సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో 107 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. రహదారి భద్రత కోసం కంటి పరీక్షలు అవసరమని అధికారులు సూచించారు.
కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, రెండు నెలల పాప మృతి ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా,…
నాగర్కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షలు సజావుగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సౌజన్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభమైంది.