భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతర ప్రాంతం అంతటా చెక్పోస్టుల వద్ద తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేసి, ట్యాంకర్ల ద్వారా నిరంతరంగా నీటి సరఫరా కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించారు. జాతర ముగిసే వరకు భక్తులకు తాగునీటి కొరత లేకుండా తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని మిషన్ భగీరథ డీఈ హేమలత తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేపట్టామని, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణంలో జాతర అనుభవం కల్పించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ హేమలతతో పాటు సీఈ లలిత, ఏఈలు మధు, సాయి, అక్బర్, సందీప్, హరినాథ్, అలాగే సిబ్బంది రాజేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.: సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం



