చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని గ్రామ వీధుల గుండా శాంతియుతంగా ర్యాలీ చేపట్టి అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. అనంతరం “జై జవాన్ – జై కిసాన్”, “భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా Akhil Bharatiya Vidyarthi Parishad (ఏబీవీపీ) నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ —
2019 పుల్వామా దాడిలో అనేక మంది భారత జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించారని, సైనికులు నిరంతరం దేశ భద్రత కోసం త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు.
గ్రామ యువత జవాన్ల వీరమరణ గాధలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.: అమరవీర జవానులకు ఘన నివాళి…
