ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పవిత్రంగా ఉపవాసాలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జీవిస్తారని పేర్కొన్నారు. ఈ పవిత్ర నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం సంప్రదాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కోశాధికారి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొట్ర బాలాజీ, చెన్నకేశవులు, పి. కళ్యాణ్ కృష్ణారావు, జె.కె. వెంకటేష్, శ్రావణ్, కరిముల్లా, రహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి ముస్లిం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.: టీఎన్జీవో ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు




