పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) భవన్‌లో ముస్లిం సోదరులు, ఉద్యోగులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పవిత్రంగా ఉపవాసాలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జీవిస్తారని పేర్కొన్నారు. ఈ పవిత్ర నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం సంప్రదాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కోశాధికారి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొట్ర బాలాజీ, చెన్నకేశవులు, పి. కళ్యాణ్ కృష్ణారావు, జె.కె. వెంకటేష్, శ్రావణ్, కరిముల్లా, రహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి ముస్లిం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.: టీఎన్జీవో ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *