చైర్మన్ ఆకుతోట సాయిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వైస్ చైర్మన్ లయన్ సూరంపల్లి రాధాకృష్ణ, ట్రెసరర్ బోయినపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అలాగే స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు చీమర్ల రమేష్ రెడ్డి, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు పోలా బాలకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, విపత్తు సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఇందుకు జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందించాలని కలెక్టర్ను వినతిపెట్టారు.
కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందిస్తూ, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేసే రెడ్ క్రాస్ కార్యక్రమాలకు జిల్లా పరిపాలన పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కలిసి పనిచేద్దామని సూచించారు.
ఈ సమావేశంతో జిల్లాలో మానవతా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని కార్యవర్గ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.: కలెక్టర్ బాదావత్ సంతోష్ ని కలిసిన Indian Red Cross Society జిల్లా నూతన కార్యవర్గం
