ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని వివరాలకు జేకేసి ఇంచార్జి రామకృష్ణను 89857 47301 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమన్వయకర్త అంజయ్య, కళాశాల అధ్యాపకులు ప్రసాద్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్లో 13న మెగా జాబ్ మేళా

