నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. మున్సిపల్ చైర్మన్గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చైర్మన్ అభ్యర్థి సునీంద్రను 4వ వార్డు కౌన్సిలర్ వసంత, 21వ వార్డు కౌన్సిలర్ పడిగే శంకర్ బలపరచగా, వైస్ చైర్మన్ అభ్యర్థి బాదం రమేష్ను 11వ వార్డు కౌన్సిలర్ ఆసిఫా బేగం, 6వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

ఈ ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిలు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా పర్యవేక్షించారు. కార్యక్రమం ప్రశాంతంగా, క్రమబద్ధంగా సాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొని నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల మరమ్మత్తులు వంటి కీలక అంశాలపై సమిష్టిగా పనిచేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చింది.

మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంతో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని పట్టు జలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.: మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్
Read more: మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *